కోల్కతా, నవంబర్ 16 : భారత్- శ్రీలంక ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా శ్రీలంక కెప్టెన్ చండిమాల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. అయితే వర్షం కురుస్తుండటంతో 9 గంటలకు వేయాల్సిన టాస్ను అంపైర్లు నిలిపివేశారు. మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లందరూ డ్రస్సింగ్ రూమ్కే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు లంక జట్టు భారత్ పై ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు.