సియోల్, నవంబర్ 15 : అమెరికా అధ్యక్షుడిపై ఉత్తరకొరియా తీవ్ర విమర్శలు సంధిస్తోంది. కిమ్ జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ట్రంప్ మరణశిక్షకు అర్హుడు. కొరియా సరిహద్దులో పర్యటన రద్దు చేసుకున్న పిరికివాడని పేర్కొంది. ట్రంప్ ఆసియా పర్యటనలో భాగంగా కిమ్ జా౦గ్ ఉన్పై విమర్శలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉత్తరకొరియా.. "మా దేశ నాయకుడిని అవమానించడం తీవ్ర నేరంగా పరిగణిస్తాం. క్షమాభిక్ష కూడా లేనంత పెద్ద నేరం అది. అందువల్ల ఆయన మరణశిక్షకు అర్హుడు" అని తన కథనంలో పేర్కొంది.