బిడ్డను చంపేసి.. తనువు చాలించింది..

SMTV Desk 2017-11-15 15:13:07  suicide, crime, mancherial,

మంచిర్యాల, నవంబర్ 15 : తొమ్మిది నెలలు మోసి, ప్రాణం పోసిన తల్లే తన బిడ్డను చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబంలోని ఆర్ధిక కారణాల వల్ల ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలి౦చారు. అసలు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తల్లి-బిడ్డ మృతితో అక్కడి ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.