జియో దెబ్బకు ఉద్యోగుల విల..విల

SMTV Desk 2017-11-15 12:12:06  reliance JIO, employees, telecom company, mumbai

ముంబై, నవంబర్ 15 : నేటి టెక్నాలజీ రంగంలో సంచలన ఆఫర్ లతో టెలికాం సంస్థలకు షాక్ ఇచ్చిన జియో తమ ఉద్యోగులపై భారీ కోత విధించింది. ఉచిత ఆఫర్ లతో కంపెనీ నష్టాల భారం తగ్గించుకొనేందుకు, ఏకంగా ఈ ఏడాది కాలంలో 75వేల ఉద్యోగులను విధుల నుండి తొలిగించిదని సమాచారం.. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంస్థ అధికారవర్గ ప్రతినిధి తెలిపారు. ఎకనామిక్ టైమ్స్ అందించిన రిపోర్ట్‌ ప్రకారం గత ఏడాది మూడు లక్షలమంది ఉద్యోగులను వివిధ టెలికాం కంపెనీలు నియమించుకోగా వీరిలో 25శాతం మందిపై వేటు పడిందని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఒత్తిడి, పోటీతత్వంతో టెలికాం ఆపరేటర్లు సతమతమవుతున్నారని, టవర్‌ సంస్థలు తమ ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని తెలిపింది. జియో రాకతో మొబైల్ సంస్థలన్ని దాదాపు నష్టాల బాటలో నడుస్తున్నాయని రిపోర్ట్ వివరించింది.