కూతురి పై అత్యాచారం

SMTV Desk 2017-06-11 11:25:44  fathar, friend, daughter,

రాంనగర్, జూన్ 11 : ఈ రోజుల్లో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. సమాజంలో ఎక్కడ చూసిన అమ్మాయిల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. సమాజంలోనే అనుకుంటే సొంత ఇంట్లో కూడా స్త్రీ కి రక్షణ లేదు. అలాంటి సంఘటనే ఇది. పెంచిన కూతురి పై తండ్రి, ప్రేమ పేరుతో మరో ఇద్దరు యువకులు కూడా అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ బాపూజీ నగర్ లో నివసించే హరీష్ (39) క్యాటరింగ్ పని చేస్తుంటాడు. ఇంట్లో ఎవరు లేని టైం చూసి హరీష్ తను పెంచుకుంటున్న కూతురు (16) పై అత్యాచారం చేసి, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించాడు. అదే కాలనీలో నివసించే సాయి కిరణ్ (22) బాలికతో మూడేళ్ళుగా స్నేహం చేస్తున్నాడు. సాయి కిరణ్ తన స్నేహితుడు నక్క రాజును బాలికకు పరిచయం చేశాడు. ఏడాది క్రితం రాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మార్చి 3 న సాయి కిరణ్ కూడా బాలిక పై అఘాయిత్యం చేయగా, వీరి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక తన తల్లి కి చెప్పింది. ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వలన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ రాంచంద్రారెడ్డి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.