ముంబాయి, నవంబర్ 12 : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే... అక్షయ్ వరుసగా నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశాడంట. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసి, భాటియా పేరుతో బాంద్రా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. వీటి ధర 18 కోట్ల రూపాయలని, ఒక్కో ఫ్లాట్ విలువ 4.5 కోట్ల రూపాయలని సినీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ్.. భార్య ట్వింకిల్ ఖన్నా, కుమారుడు ఆరవ్, కుమార్తె నటాషాలతో కలిసి జుహులోని డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు.