ఫిలిప్పిన్స్‌ ప్రయాణమైన ప్రధాని మోదీ....

SMTV Desk 2017-11-12 12:37:42  Indian Prime Minister Narendra Modi, Philippines Tour, India-Asia Conference

న్యూఢిల్లీ, నవంబర్ 12 : భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఫిలిప్పిన్స్‌కు ప్రయాణమయ్యారు. ఇండియా-ఆసియాన్‌ సమావేశం కోసం బయల్దేరిన మోదీ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆసియాన్‌ 50వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న వేడుకలకు హాజరవుతారు. పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టెతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతోపాటు, ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సుకు హాజరయ్యే ఇతర దేశాధినేతలతోనూ మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ఇండియా-ఆసియాన్‌ సదస్సుతో పాటు తూర్పు ఆసియా భేటీలోనూ పాల్గొననున్నట్లు సమాచారం.