సరళతరమైన జీఎస్టీ కావాలి :రాహుల్‌ గాంధీ

SMTV Desk 2017-11-12 10:42:52  GST, Congress vice president Rahul Gandhi, Gujarath Elections, Gandhinagar

గాంధీనగర్‌, నవంబర్ 12 : కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ప్రజలు ఒత్తిడి చేయడం వల్లనే అనేక వస్తువులపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్ శాసనసభలా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రానికి విచ్చేసిన రాహుల్ గాంధీనగర్ లోని అక్షర్‌ధామ్‌ ఆలయనికి శనివారం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యాపార వర్గాలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించిన రాహుల్ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తము సంతోషంగా ఏమిలేమని అన్నారు. ఇంకా అనేక వస్తువులను 18 శాతం ప్రజల్లోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గరిష్ఠ పరిమితి 18 శాతం ఉండేలా, సరళతరమైన జీఎస్టీ కోసం తమ పోరు కొనసాగుతుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.