త్రుటిలో తప్పిన ప్రమాదం..

SMTV Desk 2017-11-11 18:57:43  Fourth floor building collapsed, Guntur district,

గుంటూరు, నవంబర్ 11 : గుంటూరులో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. నంది వెలుగు రోడ్డులోని మణి హోటల్ వద్ద నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ భవనం ముందు భాగ౦లో ఇరువైపులా మురుగు కాల్వల నిమిత్తం కాలువలు తవ్వారు. ఈ నేపథ్యంలో అక్కడ మరమత్తులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా నేలమట్టమై౦ది. అదృష్టవాశాత్తు ఈ విషయాన్ని కూలీలు ముందే గమనించడంతో అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.