తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది: మోత్కుపల్లి

SMTV Desk 2017-11-11 18:53:22  Motukupalli NARASIMHULU, TDP, TELANGANA,

హైదరాబాద్, నవంబర్ 11 : ఇటీవల తెలంగాణా టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో టీడీపీ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ... సొంత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినప్పటికీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని పేర్కొన్నారు. పత్తి, వరి రైతుల సమస్యలపై ఈ నెల 20న నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు.