మద్యం మత్తులో ఉన్న యువతి పై గ్యాంగ్ రేప్

SMTV Desk 2017-06-10 16:56:33  gang rape

విశాఖపట్నం, జూన్ 10 : విశాఖపట్నం లో జరిగిన అత్యాచారం కలకలం సృష్టిస్తుంది. అత్యాచారం జరిగిన నాలుగు రోజుల తరువాత బయటకు వచ్చాయి. యువతికి మందు తాగించి మత్తులో ఉండగా అత్యాచారం చేసారు. ఒకే హోటల్లో ఇద్దరు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తరువాత ఇద్దరు కలిసి అదే హోటల్లో 6 నెలల వరకు పనిచేసారు. రెండు నెలల క్రితం శ్రీదర్ ఆ ఉద్యోగం మానేసాడు. చాలా రోజుల తరువాత ఈ నెల 4 న శ్రీధర్ హోటలో రూమ్ తీసుకున్నాడు. ఆ రోజు యువతి హోటల్లో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో శ్రీధర్ ఆమె దగ్గరకు వెళ్లి మనం కలిసి పని చేసాం ఒక్కసారి మనం రూమ్ కు వెళ్దాం ఈ ఒక్క రోజు మనం గడుపుదాం అని బలవంత పెట్టాడు. కలిసి పనిచేసిన చనువుతో ఆ యువతి ఒప్పుకుంది. ఆమెను రూమ్ కు తీసుకెళ్ళి అక్కడ ఆమెను మాటల్లోకి దింపి మద్యం తాగించాడు. ఆమె మందు మైకం లో ఉండగా శ్రీధర్ అతని స్నేహితులతో కలిసి యువతి పై అత్యాచారం చేసాడు. తెల్లవారి హోటల్ సిబ్బంది ఆమెను చూసి మత్తులో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించి ఎవ్వరికి అనుమానం రాకుండా యువతిని వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్లారు. తరువాత 4 రోజులకి పోలీసుస్టేషన్ లో వాళ్ళ పై పిర్యాదు మేరకు దర్యాప్తు చేసి శ్రీధర్, అతని స్నేహితుడు విజయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.