అమరావతి, నవంబర్ 11 : అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనాల్సిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, కేరళ రాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. ఈ సందర్భంగా కేరళలో ఉన్న అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను చంద్రబాబు సందర్శించనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. అనంతరం అమరావతికి తిరిగి వచ్చి, సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అప్పటికైనా ప్రతిపక్ష నేతలతో అసెంబ్లీ సమావేశ౦ జరుగుతోందో లేదో అని రాజకీయ నేతలు ఎదురుచూస్తున్నారు.