అమరావతి, నవంబర్ 11 : ఏపీ అసెంబ్లీ, శాసనమండలి చీఫ్ విప్ ల పదవులు ఖారారయ్యాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి పేర్లను వెల్లడించారు. అసెంబ్లీ చీఫ్ విప్ గా మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, శాసనమండలిలో చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్ లను ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా ఇదివరకే శాసనమండలి చైర్మన్ గా ఫరూఖ్ పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రఘునాథ రెడ్డి, పయ్యావులతో కలిసి మాట్లాడిన అనంతరం వారిరువురికి పలు సూచనలు చేశారు.