కర్నూల్, జూన్ 10 : కర్నూల్ నగరంలో రాజ్ విహార్ కూడలి వద్ద హుస్సేన్ అనే హోంగార్డు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. ట్రాఫిక్ సిగ్నల్ ను ఉల్లంఘించడాన్ని గమనించిన హోంగార్డు, కానిస్టేబుల్ వాహనాన్ని ఆపి, తాళం చెవులను తీసుకోవడానికి ప్రయత్నించాడు. అందులకు కానిస్టేబుల్ నా బండినే ఆపుతావా? అని దురుసుగా మాట్లాడడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడికి పాల్పడ్డారు. నడిరోడ్డు పైనే ఇద్దరు పోలీసులు దాడి చేసుకుంటే అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.