హైదరాబాద్, నవంబర్ 10 : విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పోరు బాటలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల నిర్మాణాలను, మినీ గురుకులాలుగా ఆధునీకరించి అభివృద్ధి పరచాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం కేసీఆర్ కు వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరచాలని సూచించారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను తిరిగి పునరుద్ధరించాలని కేసీఆర్ ను కోరారు.