హైదరాబాద్, నవంబర్ 10 : నిజామాబాద్ పరిధిలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ను కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎంతో సమావేశమైన కవిత.. ఆర్వోబీలు, ఆర్యూబీలు, ఫుట్ఓవర్ వంతెనలతో పాటు ఇతర పనులను సత్వరమే పూర్తి చేసి, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటైన నిజామాబాద్ నుండి వివిధ మార్గాలకు రైలు సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు. నిజామాబాద్ పండరీపూర్ ప్యాసింజర్ను ఎక్స్ప్రెస్గా మార్చాలని, పడ్డల్ రైల్వేస్టేషన్ శివారుల్లో పసుపు పార్కు ఏర్పాటు అవుతున్నందున ఎగుమతి, దిగుమతుల కోసం అక్కడ మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైల్వే లైన్ కోసం సేకరించిన భూమికి పరిహారాన్ని ఇవ్వాల్సి౦దిగా కోరారు. ఈ విషయాలపై స్పందించిన జీఎం.. సమస్యలన్ని౦టిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.