ముంబై, నవంబర్ 10 : నేటి టెలికాం రంగంలో వరుస ఆఫర్లతో ప్రత్యర్ధి కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న జియో మరో ఆఫర్ ను వినయోగాదారులకు ప్రకటించింది. ఇందులో భాగంగా జియో ప్రైమ్ కస్టమర్లు రూ.399 అంతకుమించిన ప్రతి రీఛార్జ్ పై రూ.2,599 వరకు నగదు వెనక్కి పొందే సరికొత్త ‘ట్రిపుల్ క్యాష్బ్యాక్’ పథకాన్ని ప్రేవేశపెట్టింది. ఈ ఆఫర్ లో రూ.399 తో లేదా అంతకంటే ఎక్కువతో రీఛార్జ్ పై వినయోగాదారులకు 400 రూపాయల జియో వోచర్లను అందిస్తారు. ఇది మైజియో యాప్ లో వెంటనే అందుబాటులోకి వస్తుంది. అయితే వీటిని ఈ నెల 15 నుండి వాడుకోవచ్చు. జియోతో ఒప్పందం చేసుకున్న అమెజాన్ పే, యాక్సిస్పే, ఫ్రీఛార్జ్, మొబిక్విక్, పేటీఎం, ఫోన్పే వంటి వాలెట్ల ద్వారా చేసుకునే ప్రతి రీఛార్జిపై రూ.300 వరకు నగదు వెనక్కి పొందవచ్చని తెలిపింది. ఇ-కామర్స్ వోచర్లు ఈనెల 20 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశం నేటి నుండి ఈ నెల 25 వరకు చేసుకునే రీఛార్జ్లపైన మాత్రమే వర్తిస్తుంది.