కర్నూలు, నవంబర్ 09 : కర్నూలు జిల్లాలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రోడ్డుపై కత్తి పట్టుకొని తచ్చాడుతూ.. కనిపించిన ప్రతి ఒక్కరిని బెంబేలెత్తి౦చాడు. అంతేకాకుండా ఆ యువకుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ కంటికి కనిపించిన ఇద్దరు వ్యక్తుల గొంతు కోసి తానూ గొంతు కోసుకున్నాడు. వెంటనే స్పందించిన పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడి కోసం ఆరా తీయగా అతను మతిస్థిమితం లేని యువకుడు యుగంధర్ గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు బాబూరావు, రవి కొండలరావు లతో పాటు యుగంధర్ ను ఆసుపత్రి తరలించి చికిత్స చేయిస్తున్నారు.