హైదరాబాద్, నవంబర్ 09 : పెండింగ్ లో ఉన్న 1616 కోట్ల ఫీజు రీయి౦బర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్య నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వివిధ పార్టీల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల ఏర్పాటుకై, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటూ కోరారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, కోదండ రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై ఈ నెల 16 న కలెక్టరేట్ ను ముట్టడించాలని నిర్ణయించారు.