న్యూ ఢిల్లీ, నవంబర్ 08 : ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్ టెల్ తమ బ్రాడ్ బ్యాండ్ వినయోగాదారులకు ఒక సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ వాడుతున్న వారి డేటా ఈ నెల మిగిలిపోయినట్లయితే ఆ డేటాను తర్వాత నెలలో వాడుకునే సౌక్యరాన్ని కల్పిస్తుంది. 1000 జీబి డేటా వరకు తదుపరి నెల వినయోగించుకునేలా ‘డేటా రోలోవర్’సర్వీస్ ను ప్రవేశపెట్టింది. మా బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు డేటా మిగిలిపోయిందని చింతించాల్సిన అవసరంలేదు. అది ఎప్పటికి మీ సొంతమే" అని ఎయిర్టెల్ సీఈవో హోమ్స్ జార్జ్ మాథెన్ వెల్లడించారు.