త్వరలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ రైలు

SMTV Desk 2017-11-08 11:28:20  high speed train, modi, telangana

హైదరాబాద్, నవంబర్ 08 : భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ తో కలిసి హైస్పీడ్ రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే రైల్వే శాఖ అధికారులు సరికొత్త ప్రతిపాదనతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి హైస్పీడ్ రైలు నడపాలని పరిశీలిస్తోంది. కానీ ప్రతిపక్షనేతలు దేశంలో పలు సమస్యలుండగా హైస్పీడ్ రైలు అవసరమా, అంటూ చర్చలు లేవనెత్తుతున్నాయి. దీంతో ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో రైల్వే శాఖ హైస్పీడ్ రైలు పై తగిన ప్రతిపాదనను తీసుకోనున్నారు. ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ వచ్చి మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఆంధ్రప్రదేశ్ ఎంపీ కేశినేని నానిలు కలిసి ఈ విషయాన్ని మోదీతో ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా, ఇరు రాజధానుల మధ్య నడిచేది బుల్లెట్ రైలు కాదని, హైస్పీడ్ రైలని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. తాజా ప్రతిపాదన ప్రకారం మొదట హైదరాబాద్-విజయవాడల మధ్యనున్న 270 కిలోమీటర్ల దూరాన్ని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే మాదిరిగా 8 లేన్లుగా విస్తరిస్తారు. అదే సమయంలో హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేయడంతో రెండు ప్రభుత్వాలు కన్సార్టియంగా ఏర్పడితే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఉపరితల రవాణాశాఖతో రైల్వే శాఖ చర్చించి తగిన నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.