రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృతి

SMTV Desk 2017-06-10 11:34:57  auto, accident, laari

జగత్ సింగ్ పూర్ , జూన్ 10 : అతి వేగం ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఓడిశా లోని జగత్ సింగ్ పూర్ లో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మాచగాన్ కు చెందిన పది మంది వారి సమీప బంధువు చనిపోవడంతో వాళ్ళు ఆ అంత్యక్రియలకు వెళ్లి వస్తున్నారు. వాళ్ళు ఆటో లో ప్రయాణిస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ వేగంగా నడుపడం వలన ఆ వేగంలో ఎదురుగా వస్తున్నా లారీని ఢీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదం లో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం లో 12 ఏళ్ల బాలిక కూడా చనిపోయింది. గాయపడిన వారిని జగత్ సింగ్ పూర్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు.