న్యూఢిల్లీ,నవంబర్ 07 : సెల్ఫీ అంటే ప్రస్తుతం యువతకు ఓ అలవాటుగా మారింది. ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ వివో 24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వీ79 ఫోన్ను మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ ఫోన్ ను ప్రత్యేకంగా సెల్ఫీ కోసమే ఆవిష్కరించింది. దీని ధర దాదాపు రూ.24,500. అయితే ఈ ఫోన్ ను చైనాలో మాత్రమే విడుదల చేసింది. భారత్ మార్కెట్ లోకి ఎప్పుడు ప్రవేశాపెడతారనే విషయాన్ని సంస్థ ధృవీకరించలేదు. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీ, 16 మెగాపిక్సెల్ ముందు కెమెరా, 24 మెగాపిక్సెల్ ముందు కెమెరా , 5.99 అంగుళాల ఫుల్స్క్రీన్ డిస్ప్లే, 3225ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిఉంది.