హోచిమిన్ సిటీ, నవంబర్ 07: ఇండియా టాప్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీకోమ్ ఆసియా ఛాంపియన్ షిప్ సెమీస్ లో తన బాక్సింగ్ పంచ్ లతో జపాన్ క్రీడాకారిణి సుబాస కొమరను మట్టికరిపించారు. ప్రత్యర్ధి ని తన ఆట తీరుతో పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో పడేసి 5-0 తేడాతో ఘన విజయం సాధించారు. మేరీ ఫైనల్లో విజయం సాధిస్తే 48 కిలోల విభాగంలో భారత్ కు పసిడి పతకం సాధించిన తొలి మహిళగా ఘనత సాధిస్తుంది.