న్యూఢిల్లీ, నవంబర్ 07 : ప్రస్తుతం టెలికాం రంగంలో జియో వరుస ప్లాన్ లతో మిగతా సంస్థలకు గట్టి పోటీనిస్తుంది. జియోకు దీటుగా ఎయిర్ టెల్, ఐడియా సంస్థలు తమ వినయోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్ లను అందిస్తున్నాయి. తాజాగా ఐడియా కేవలం రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత వాయిస్ కాల్స్ ,1 జీబి డేటాను అందించనుంది. 28 రోజులు వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ లో యూజర్లు మైఐడియా యాప్ నుంచి రీఛార్జి చేసుకుంటే అదనంగా మరో 1జీబీ డేటాను ఉచితంగా ఇస్తారు.