రాజమహేంద్రవరం, నవంబర్ 06 : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాష అయిన తెలుగును మాత్రం మరవద్దని విద్యార్థులతో అన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎన్నటికీ మరువకూడదని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అలాగే పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే యువతకు కేంద్ర ప్రభుత్వం రుణాలిస్తోందని, వాటిని వినియోగించుకుని వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు. మార్కుల కోసం కాకుండా, వ్యక్తితంలో మార్పు కోసం చదవాలని ఆయన వెల్లడించారు.