జగన్ పాదయాత్ర పై బుద్దా వెంకన్న ఫైర్

SMTV Desk 2017-11-05 18:24:33  jagan padhayatra, buddha venkanna fire, tdp , ysrcp

కడప, నవంబర్ 5 : ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ ను ప్రజలు నిలదీయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో శ్రీరాముడి పాలన నడుస్తోందని, ఏం చేయాలో తెలియని రాక్షసుడు పాదయాత్రకు సిద్ధమయ్యాడంటూ జగన్ పై వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో మత కలహాలు, కుల ఘర్షణలు సృష్టించేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వెళ్లే లోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పార్టీకి ఒక నియంత అధ్యక్షుడైతే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం జగన్ అని, 2019 ఎన్నికల నాటికి ప్రతిపక్షమే ఉండదని, టీడీపీకు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.