రాజ్ కోట్, నవంబర్ 05 : కివీస్ తో జరిగిన రెండో T-20 లో తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని భారత్ జట్టు సారధి కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. "మా జట్టులో బ్యాట్సమన్ లు సమష్టి పోరాటం చేయాలి కానీ మేము అలా చేయలేదు. నా వరకూ పోరాడా. అదే సమయంలో ధోని కూడా శాయశక్తులా కృషి చేశాడు. కానీ ఛేదించాల్సిన లక్ష్యం చివరకు మాకు కష్ట సాధ్యంగా మారిందని" అని వ్యాఖ్యానించాడు.