కార్తీక వేడుకల్లో అపశ్రుతి..

SMTV Desk 2017-11-04 12:06:56  Karthika punnami, patna, bihar Simaria Ghat in Begusarai, 3numbers death

పట్నా, నవంబర్ 04 : నేడు కార్తీక పౌర్ణమి కావడంతో దేవాలయాల్లో, నదితీరాల్లో వేలాదిమంది భక్తులు కిక్కిరిసి పోవడం సాధారణమే. బిహార్‌లో కూడా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బెగుసరయ్‌లోని సిమారియా ఘాట్‌ వద్ద గంగానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆ సమయంలో ఘాట్‌ వద్ద ఏదో జరిగిందని వదంతులు రావడంతో కంగారుపడిన భక్తులు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. అసలు ప్రమాదం ఎలా పొంచి వచ్చిందో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.