తెరాస, కాంగ్రెస్ నేతలతో సరదా సంభాషణ...

SMTV Desk 2017-11-03 18:09:13  TRS, Congress, PCC president Uttamkumar, The rulers MLA is Errabelli, assembly, hyderabad

హైదరాబాద్, నవంబర్ 03 ‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెరాస, కాంగ్రెస్ నేతలతో ఓ సంభాషణ జరిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ ఎదురుగా వెళుతుండగా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు గడ్డం ఎప్పుడు తీస్తావ్‌ అన్నా అంటూ ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్‌ రానున్న ఎన్నికల తర్వాత అంటూ బదులిచ్చారు. ఏంటీ చాలా ప్రశాంతంగా ఉన్నావని ఎర్రబెల్లిని ఉత్తమ్‌ అడుగగా, ఇక టెన్షన్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆ టెన్షన్లు మీకు మొదలయ్యయంటూ ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు గనక.. ఇక ఆ పార్టీకి టెన్షన్లు మొదలవుతాయనే ఉద్దేశంతో ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.