తిరుమల, నవంబర్ 03 : తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి సేవా ఆర్థిక టికెట్లను తితిదే విడుదల చేసింది, 2018 ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల మొత్తం 52,190 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ లక్కీడిప్ కోటా కింద 10,080 సేవా టికెట్లను జారీ చేసింది. వీటిలో సుప్రభాతం 7300, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన సేవ 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయి. తితిదే వెబ్సైట్ను అన్ని భాషల్లో తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. టికెట్ల కోసం ఆన్లైన్లో ఈ రోజు నుంచి వారం రోజులపాటు నమోదు అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.