అమరావతి, నవంబర్ 02 : జాతీయ వ్యవసాయ సదస్సుకు విశాఖ వేదిక కానుంది. ఏపీ ప్రభుత్వం-మిలింద గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 15, 16, 17 తేదీల్లో ఈ వ్యవసాయ సదస్సు జరగను౦దని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విత్తన పరిశోధన, అగ్రి టెక్నాలజీ, హార్టికల్చర్, వ్యవసాయంలో నూతన పద్దతుల వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తామని సోమిరెడ్డి మీడియాకు తెలిపారు. సదస్సులో అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, ఐయోవా, నెదర్లాండ్ వర్శిటీ ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే వ్యవసాయ నూతన పద్ధతులు గురించి 50-60 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, సదస్సు చివరి రోజైన 17న బిల్ గేట్స్, చంద్రబాబు హాజరవుతారని మంత్రి సోమిరెడ్డి తెలిపారు.