హైదరాబాద్, నవంబర్ 02 : నేడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెదేపా నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, కొత్తకోట దయాకర్రెడ్డి, గరికపాటి, సండ్ర వెంకట వీరయ్య, అరవింద్కుమార్ గౌడ్, ఉమా మాధవరెడ్డి, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, త్వరలో మహానాడును హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఎల్.రమణ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలురువు నేతలు సీఎం చంద్రబాబును సన్మానించారు.