ఎన్టీపీసీ ప్రమాద బాధితులకు రాహుల్‌గాంధీ పరామర్శ

SMTV Desk 2017-11-02 13:29:21  NTPS Victims, Congress vice president Rahul Gandhi, Rae Bareli Utharapradesh

రాయ్‌బరేలీ, నవంబర్ 02 : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్టీపీసీ ప్రమాద బాధితులను నేడు పరామర్శించారు. రాయ్‌బరేలీలోని వూంచాహార్‌లోని జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బాయిలర్‌ పేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌.. తన పర్యటనను మధ్యలో ఆపేసి నేడు రాయ్‌బరేలీ వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య 26కు పెరిగిందని యూపీ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.