ట్రాన్స్‌ఫార్మర్ పేలి 14 మంది మృతి

SMTV Desk 2017-11-01 18:27:06  Rajasthan crime news, Transformer exploded, 14 people were killed.

జైపూర్, అక్టోబర్ 01 : ట్రాన్స్‌ఫార్మర్ పేలి 14 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపురా టౌన్ లోని ఖతులాయ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో పెళ్లి వేడుకలకు అంతా సిద్దం చేసుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమంలో భాగంగా వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. అలాగే కేంద్ర మంత్రి, జైపూర్ రూరల్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు.