న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐసిస్) సంచలన ఫోటోలను ఆన్ లైన్ లో విడుదల చేసింది.. ఇందులో ప్రపంచ అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్ళు అయిన రొనాల్డో(పోర్చుగల్), మెస్సీ(అర్జెంటీనా), నెమార్(బ్రెజిల్) లను ఎలా హత్య చేస్తారో తెలిపే ఊహాజనిత చిత్రాలను నెట్ లో అప్ లోడ్ చేసింది. ‘ఇప్పుడు మేం రాస్తున్నాం. మీరు చదువుతున్నారు. త్వరలో ఇదే వార్తను మీరు వింటారు’ అనే హెచ్చరికను విడుదల చేసిన ఫొటోలపై ఐసిస్ ముద్రించింది. కాగా 21 వ ఫుట్ బాల్ ప్రపంచ కప్-2018 రష్యాలో 14 జూన్ –15 జూలై వరకు జరగనుంది.