హైదరాబాద్, అక్టోబర్ 30 : ప్రముఖ మాజీ క్రికెటర్ ఎం.వి శ్రీధర్(53) గుండె పోటుతో మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 2 వ తేది ఆగష్టు 1966లో జన్మించిన ఈయన పూర్తి పేరు మాటూరి వెంకటేష్ శ్రీధర్. శ్రీధర్ 1988-1989 నుంచి 1999-2000 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం వహించి 48.91 సగటుతో 6,701 పరుగులు సాధించాడు. ఇందులో 21 శతకాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈయన గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంస్థలో సెక్రటరీగా కూడా పని చేశారు. ఈయన మరణంపై హెచ్ సీఏ ఆధికారులు, బీసీసీఐ పెద్దలు సంతాపం తెలిపారు.