ఉత్తరకొరియా, అక్టోబర్ 29 : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాతో ఏ క్షణంలోనైన యుద్ధం జరగవచ్చని అంతా భావిస్తున్న తరుణంలో సముద్ర తీర ప్రాంతం నుండి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇదే అదునుగా చూసుకొని శత్రువులు టార్గెట్ చేస్తారేమోనని రాత్రివేళల్లో కరెంట్ కట్ చేసి రాత్రంతా అంధకారంలో గడుపుతు౦డడం విశేషం. కాగా ఇప్పటికే ఆయుధాలను తరలించారని “ఎన్కే న్యూస్” వెల్లడించిన విషయం విదితమే. ఈ ఉత్తరకొరియా తాజా పరిణామాలతో తీవ్ర అలజడి చెలరేగుతోంది.