కాన్పూర్, అక్టోబర్ 28 : భారత్-కివీస్ మధ్య మూడో మ్యాచ్ చాలా నిర్ణయాత్మకంగా మారనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 1-1 తో ఇరు జట్లు సమం చేయగా, ఫలితం తేల్చే చివరి మ్యాచ్ రేపు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. రెండో వన్డేలో ఘనవిజయం సాధించిన కోహ్లి సేన మూడో వన్డేలో కూడా అదే స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే న్యూజిలాండ్ జట్టు కూడా తోలి వన్డేలో టీం ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో విరాట్ సేన మూడో వన్డేలో కివీస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే యోచనలో ఉంది.