తూర్పుగోదావరి, అక్టోబర్ 28 : ఆటో, లారీ ఢీకొని ఐదుగురు మృతి చెందిన ఘటన కొత్తపేట మండలంలోని మోడేకుర్రు వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అల్లవరం నుండి వాడపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి ప్రయాణికులతో వస్తున్న ఆటో మోడేకుర్రు మెయిన్ రోడ్ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. తూ.గో. రిపోర్టర్ ఆనంద్