దహేజ్, అక్టోబర్ 22 : భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా నేడు సౌరాష్ట్రలోని ఘోఘా ప్రాంతంలో రోరో జలయాన ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ రోరో ప్రాజెక్టు ప్రయోజనాలపై మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు భారత్కు అమూల్యమైన బహుమతి అని అన్నారు. అనంతరం రోరో పడవలోనే దహేజ్ చేరుకుని పడవలో విద్యార్థులతో ముచ్చటించారు. రోరో అంటే రోల్ ఆన్, రోల్ ఆఫ్. నదీ మార్గం ద్వారా ప్రయాణికులను అటూ ఇటూ చేరే వేసే జలయాన సేవ అని తెలిపారు. సౌరాష్ట్రలోని ఘోఘా నుంచి దక్షిణ గుజరాత్లోని దహేజ్ల మధ్య తొలిదశ జలయాన ప్రాజెక్టును నేడు మోదీ ప్రారంభించారు.