పాక్ క్రికెట్ లో బూకీ కలకలం..

SMTV Desk 2017-10-21 19:09:05  pakisthan cricket board, pak captain sarparaj ahmad,

దుబాయ్, అక్టోబర్ 21 : సంచలనాలకు మారు పేరుగా ఉండే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరో వివాదంలో చిక్కుకుంది. పాక్ క్రికెట్ సారధి సర్ఫరాజ్ అహ్మద్‌ను బూకీ కలవడం ఇప్పడు పాక్ క్రికెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం పాక్-శ్రీలంక మధ్య దుబాయ్‌లో ఐదు వన్డేల సిరీస్ జరుగుతుండగా పాకిస్థాన్ 4-0తో ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. మూడో వన్డేకు ముందు బూకీ ఒకరు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి శ్రీలంకను గెలిపించాలని కోరినట్టు సమాచారం. బూకీ తనను కలిసిన విషయాన్ని సర్ఫరాజ్ వెంటనే పీసీబీ అవినీతి వ్యతిరేక యూనిట్‌కు సమాచారం అందించడంతో పీసీబీ అప్రమత్తమైంది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామంటూ పీసీబీ అధికారి తెలిపారు.