క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..

SMTV Desk 2017-10-21 18:07:56  cricket betting Team arrest, guntur distict, home guard koteshwar rao.

గుంటూరు, అక్టోబర్ 21 : గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులతో పాటు వారికి సహకరించిన హోం గార్డ్ కోటేశ్వర్ రావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి లక్ష మూడు వేల రూపాయల నగదును, నాలుగున్నర కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా బెట్టింగ్ కు ఉపయోగించే లాప్ ట్యాప్, టీవీ, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లో ఓడిపోయిన వారి వద్ద రాయించుకున్న రూ.10 లక్షల విలువైన ప్రామీసరి నోట్లు నిందితుల వద్ద లభ్యమయ్యాయి.