ముంబై ,అక్టోబర్ 20 : దేశ ఆర్ధిక రాజధాని ముంబై కాండీవలి ఈస్ట్ ప్రాంతంలో ‘కోహ్లి- ధోని’ల పేరిట రెస్టారెంట్ వెలిసింది. వారిద్దరూ కలిసి రెస్టారెంట్ వ్యాపారం ఎప్పుడు ప్రారంభించారని అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే ధోనీ, కోహ్లీ మీద అభిమానంతో ముంబైకి చెందిన ఓ వ్యక్తి వాళ్ళిద్దరి పేరుతో రెస్టారెంట్ పెట్టారు. క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు ఇలా పేరు పెట్టారు తప్ప ఈ రెస్టారెంట్తో ధోనీకి, కోహ్లికి ఎటువంటి సంబంధం లేదని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ ఈ నెల 22న కివీస్ తో జరిగే తొలి వన్డే ఆడటం కోసం సన్నద్ధమవుతున్నారు.