న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జలీగ్రాంట్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి కేదార్నాథ్కు బయలుదేరుతారు. చలికాలం కారణంగా శనివారం నుంచి ఈ గుడి ఆరు నెలల పాటు మూసి ఉంటుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ సందర్శనం అనంతరం మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. 2013లో సంభవించిన జలప్రళయంలో దెబ్బతిన్న ఆదిశ౦కరాచార్య సమాధి పునర్నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని కేదార్నాథ్ పర్యటన సందర్భంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.