రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలి: మోత్కుపల్లి

SMTV Desk 2017-10-20 15:27:52  revanth reddy, tdp, mothkupalli narasimhulu

హైదరాబాద్, అక్టోబర్ 20: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పార్టీను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయనకు టీడీపీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కే అర్హత లేదని అన్నారు. టీ టీడీపీ సమావేశం సందర్బంగా మీడియాకు లీకులిచ్చేందేవరు అని ప్రశ్నించాం, కానీ దీనికి సమాధానం స్పష్టంగా రాలేదని తెలిపారు. రేవంత్ రెడ్డిను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.