ఓవెన్ లో పెట్టి చ౦పేసిన కసాయి తల్లి...

SMTV Desk 2017-10-20 10:53:28  america, crime, latest updates

అమెరికా, అక్టోబర్ 20: చాటింగ్ చేస్తూ కన్న పిల్లలను ఉడికించి చ౦పేసిన దారుణమైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అట్లాంటాకు చెందిన లమోరా విలియమ్స్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక రోజు తన భర్త తో చాటింగ్ చేస్తూ తన రెండేళ్ల కుమారుడు కెయుంటే పెన్, ఏడాది చిన్నారి జాకార్టర్ విలియమ్స్‌లను ఓవెన్‌లో పెట్టి ఉడికించి౦ది. అప్పటికే ఎదో ఘోరం జరుగబోతుందని ఊహించిన చిన్నారుల తండ్రి జమీల్ పెన్ పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు ఆమె ఇంటికి చేరుకునే సరికి ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. విలియమ్స్ మానసిక వ్యాధితో బాధపడుతుందని ఇరుగుపొరుగు వారు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆమె పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.