హైదరాబాద్, అక్టోబర్ 19: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకొని, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకున్న విజయ దేవరకొండ, ప్రస్తుతం మరోసారి ప్రేమ కథా చిత్రంతో అభిమానులకు అలరించడానికి సిద్దం అవుతున్నారు. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో విజయ దేవరకొండ కథానాయకుడిగా ‘ఏమ౦త్రం చేసావే’ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి సందర్బంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పడుకొని విజయ్ దీనంగా చూసే లుక్ అందరినీ ఆకట్టుకో౦టుంది. మరోపక్క అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు.