హైదరాబాద్, అక్టోబర్ 19 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. కొనుగోలు దారులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ రకాల మట్టి ప్రమిదలు ప్రత్యేక ఆకర్షణకు నిలుస్తున్నాయి. మిఠాయి దుకాణాల్లో రద్దీతో కోలాహలంగా మారాయి. బాణాసంచా కొనుగోలు ఊపందుకోగా అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి టపాసుల ధర ఎక్కువ పలుకుతుందని ప్రజల అభిప్రాయం.