టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి ఫైర్..

SMTV Desk 2017-10-18 17:16:14  Telangana TDP Working President, Rev. Reddy,

హైదరాబాద్ ,అక్టోబర్ 18 : తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి టీడీపీ నేతలపై సంచలన వాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జైళ్లలో పెడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆయనకు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్‌, ఏపీ మంత్రి పరిటాల ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు టీడీపీ నేతలు ఘన స్వాగతం తెలిపారు. అదే చంద్రబాబు సీతక్క ఇంట్లో పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ మంత్రులు పట్టించుకున్నారా? ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య ఆర్ధిక సంబంధాలున్నాయని అందువల్లే యనమలకు కేసీఆర్‌ రూ.2000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. తెలంగాణలో రాజకీయ పార్టీలు లేవని టీఆర్‌ఎస్‌ పై వ్యతిరేకులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు విషయం చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ వెల్లడించారు.